- స్టేట్ డివైడ్ అయ్యాక నామమాత్రంగా కామారెడ్డి కాలేజీ
- 12 మందికి నలుగురే రెగ్యులర్ ప్రొఫెసర్లు
- పీజీ కోర్సులు లేక పైచదువులకు దూరమవుతున్న స్టూడెంట్లు
కామారెడ్డి, వెలుగు: రాష్ట్రంలోని ఏకైక డెయిరీ కాలేజీ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది. స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి ఇది సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. కొన్నేండ్ల క్రితం బీఎస్సీ కోర్సును బీటెక్గా అప్గ్రేడ్ చేసినప్పటికీ దానికి అనుగుణంగా ప్రొఫెసర్లు, స్టాఫ్ సంఖ్యను పెంచలేదు. రిటైర్ అయిన వారి స్థానంలో రెగ్యులర్ప్రొఫెసర్లను నియమించకుండా కాంట్రాక్ట్ లెక్చరర్లతో నెట్టుకొస్తున్నారు. పీజీతోపాటు మరికొన్ని డెయిరీ కోర్సులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నా స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు.
బీఎస్సీ నుంచి బీటెక్గా..
కామారెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మొదట మూడేళ్ల బీఎస్సీ డెయిరీ కోర్సు మాత్రమే ఉండేది. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించేది. ఆ తర్వాత పీజీ చేసేందుకు స్టేట్ లో ఈ కోర్సుకు సంబంధించిన కాలేజీనే లేదు. స్టూడెంట్స్ పై చదువులకు వెళ్లేందుకు చాన్స్ లేకుండా పోయింది. సుదీర్ఘ పోరాటం తర్వాత వర్సిటీ 2003లో బీఎస్సీని బీటెక్ డెయిరీ కోర్సుగా మార్చింది. ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పించింది. కానీ ఆ తర్వాత ఓయూ అడ్మిషన్లు చేపట్టలేదు. ఒక్కగానొక్క కాలేజీలో ఈ ఒక్క కోర్సు నిర్వహణ భారంగా మారిందని ఆపేసింది. దీంతో స్టూడెంట్లంతా మరోసారి ఆందోళన చేశారు. 2005లో కోర్సును తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సెపరేట్ కాలేజీగా..
ఉమ్మడి రాష్ట్రంలో బీటెక్ డెయిరీ కోర్సులు కేవలం కామారెడ్డి, తిరుపతిలోనే ఉండేవి. కానీ కామారెడ్డిలో ఈ కోర్సుకు సపరేట్ కాలేజీ బిల్డింగ్, హాస్టళ్లు, మినీ డెయిరీ ప్లాంట్ ఇవేం లేవు. ఈ నేపథ్యంలో వాటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 కోట్ల ఫండ్స్తోపాటు 60 ఎకరాల స్థలం కేటాయించింది. నిర్వహణ మొత్తం ఎస్వీ యూనివర్సిటీ చూసేది. స్టేట్డివైడ్ అయ్యాక పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. ఎంసెట్ద్వారా ఏటా 35 మంది స్టూడెంట్లు జాయిన్ అవుతున్నారు. నేషనల్ కోటాలో ఇతర రాష్ట్రాల స్టూడెంట్లు వస్తుంటారు.
డీన్, నలుగురు ప్రొఫెసర్లే..
కాలేజీలో12 ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా బీఎస్సీ డెయిరీ కోర్సు ఉన్నప్పటి పోస్టులే. ప్రస్తుతం వాటిలో డీన్, నలుగురు ప్రొఫెసర్లే రెగ్యులర్. మిగతా ఏడుగురు కాంట్రాక్ట్లెక్చరర్లే. బీఎస్సీ నుంచి అప్గ్రేడ్ అయ్యాక రెగ్యులర్ ప్రొఫెసర్ల సంఖ్యను పెంచాల్సి ఉంది. కానీ పెంచలేదు. దానికితోడు ఉన్న 12 ఖాళీల్లో రిటైర్ అయితే ప్రభుత్వం కొత్తవారిని నియమించడం లేదు.
పీజీ కోర్సులకు చాన్స్ఉన్నా..
డెయిరీ కాలేజీలో పాలిటెక్నిక్, పీజీ కోర్సులతోపాటు ఇతర కోర్సులు ప్రవేశపెట్టడానికి అవసరమైన వనరులు ఉన్నాయి. 60 ఎకరాల స్థలం ఉంది. బిల్డింగ్స్, హాస్టళ్లు, ల్యాబ్స్ నిర్మాణాలకు కావాల్సినంత స్పేస్ ఉంది. సర్కారు పట్టించుకుంటే అగ్రికల్చర్కు అనుబంధంగా డెయిరీ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం బీటెక్కంప్లీట్ కాగానే పీజీ కోసం స్టూడెంట్స్ గుజరాత్, హర్యానా స్టేట్స్ వెళ్తున్నారు. పేద స్టూడెంట్లయితే ఇక్కడితోనే చదువును ఆపేస్తున్నారు. పీజీ కోర్సు స్టార్ట్ చేస్తే స్టేట్లో పాడి పరిశ్రమను పెంచొచ్చు.
ప్రొఫెసర్ల ఖాళీలు
డెయిరీ టెక్నాలజీలో 4, డెయిరీ కెమిస్ట్రీలో 4, ఇంజనీరింగ్, మైక్రోబయోలజీ, బిజినెస్ మెనేజ్మెంట్ కోసం ఒక్కో విభాగంలో ఇద్దరేసి ప్రొఫెసర్లు కావాల్సి ఉంది. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ నీడ్ఉంది. అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నాన్టీచింగ్ స్టాఫ్ని నియమిస్తున్నారే తప్ప రెగ్యులర్ స్టాఫ్ ని ప్రభుత్వం నియమించడం లేదు.
ఇవి కూడా చదవండి..
ఉచిత తాగునీటి పథకం.. క్షేత్రస్థాయిలో అంతా గందరగోళం