టీచర్లను వేరే స్కూల్​కు పంపొద్దు

టీచర్లను వేరే స్కూల్​కు పంపొద్దు

ఊట్కూర్,వెలుగు : తమ ఊరి స్కూల్​లో పని చేస్తున్న టీచర్లను వేరే మండలాలకు పంపొద్దని పెద్దపొర్ల విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్​ చేశారు. మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి, సర్పంచ్ రవికుమార్ డీఈఓ ఆఫీస్​లోని సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు. పెద్దపొర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 220 మంది విద్యార్థులు ఉంటే.. 4 గురు టీచర్లే ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, టీచర్లను ఇతర మండలాలకు పంపొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపోర్ల బీజేపీ బూత్ అధ్యక్షులు బోయిన్ పల్లి నరేశ్​, బోయిన్ పల్లి వెంకటయ్య, గోవింద్ పాల్గొన్నారు.