- పోటాపోటీ చేరికలతో అయోమయంలో క్యాడర్
నల్గొండ, వెలుగు: టీపీసీసీ చీఫ్రేవంత్రెడ్డి, స్టార్క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆధిపత్య పోరుకు ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికలా మారింది. ఈ లీడర్లిద్దరూ తమ వర్గాలకు చెందిన నేతలను ఎవరికివారే పార్టీలో చేర్చుకుంటుండడంతో క్యాడర్ పరేషాన్ అవుతోంది. మొదట్లో పీసీసీ అధ్యక్ష పదవికి అటు రేవంత్, ఇటు కోమటిరెడ్డి పోటీ పడగా, హైకమాండ్ రేవంత్రెడ్డిని ఓకే చేసింది. అలిగిన కోమటి రెడ్డి గాంధీభవన్లో అడుగుపెట్టనని ప్రతినబూనాడు. తర్వాత ఢిల్లీ పెద్దల బుజ్జగింపుతో కలిసిపనిచేస్తామని నేతలిద్దరూ ప్రకటించినా ఇటీవల నల్గొండ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు బట్టి విభేదాలు ఇంకా సమసిపోలేదని అర్థమవుతోంది.
గేమ్ మొదలుపెట్టిన కోమటిరెడ్డి
రేవంత్రెడ్డి ప్రమేయం లేకుండా ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వడ్డేపల్లి రవిని జూన్ 26న పార్టీలో చేర్చుకున్నారు. 201 8 ఎన్నికల్లో రవికి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై రెబల్గా పోటీ చేశాడు. ఓట్లు చీలిపోవడంతో దయాకర్ ఓటమికి రవి పరోక్షంగా కారకుడయ్యాడు. దీనిని సీరియస్గా తీసుకున్న హైకమాండ్ రవిని ఆరేండ్ల పాటు సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ రివోక్ కాకముందే రవిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి రేవంత్ ఒప్పుకోలేదు. పార్టీలో చేరడానికి ముందు, రేవంత్ అపాయిట్మెంట్ కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. పీసీసీ చీఫ్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరె డ్డి వడ్డేపల్లి రవిని పార్టీలో చేర్చుకోవడాన్ని రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్వర్గీయుడైన అద్దంకి దయాకర్ వ్యతిరేకించారు.
గేమ్కంటిన్యూ చేస్తున్న రేవంత్..
కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదలు పెట్టిన గేమ్ను రేవంత్ కంటిన్యూ చేస్తున్నారు. తాజాగా దేవరకొండ నియోజకవర్గంలో వెంకట్రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్వర్గీయులు కాంగ్రెస్లో చేరడం అగ్గికి ఆజ్యం పోసినట్లయింది. రేవంత్ టీడీపీ లో ఉన్నప్పుడు ఆయన వర్గంగా పనిచేసిన అప్పటి జిల్లా అధ్యక్షుడు బి ల్యానాయక్ శుక్రవారం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. రేవంత్తో పాటే కాంగ్రెస్లో చేరిన బిల్యానాయక్ 2018 ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ హైకమాండ్ ఆయనను కాదని మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్ కు టికెట్ ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో బిల్యా బీఎస్పీ నుంచి పోటీ చేయడంతో కాంగ్రెస్ క్యాండేట్ బాలూనాయక్ ఓడిపోయారు. ప్రస్తుతం బాలూనాయక్, మరో నేత కిషన్ నాయక్ఇద్దరూ కోమటిరెడ్డి వర్గంలో కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వీళ్లలో ఎవరో ఒకరికి టికెట్ వస్తదనే నమ్మకంతో ఉన్నారు. కానీ అనూహ్యంగా బిల్యా నాయక్ పార్టీలో చేరడంతో జిల్లా కాంగ్రెస్లో కొత్త చిచ్చు పెట్టినట్లైంది. కాగా, తుంగతుర్తిలో వడ్డేపల్లి రవి చేరిక చెల్లదని ఇటీవల పీసీసీ ప్రకటించినట్లే బిల్యానాయక్చేరిక కూడా చెల్లదని ఎంపీ కోమటిరెడ్డి ఆదివారం హైదరాబాద్లో చేసిన కామెంట్లు పార్టీలో చర్చకు దారితీశాయి.
ఇది ఎంతవరకు?
అమెరికా టూర్తో రేవంత్, కోమటిరెడ్డి మధ్య విభేదాలు సమసిపోయాయని పార్టీ హైకమాండ్ భావించింది. కానీ కొద్ది రోజులకే తుంగతుర్తి, దేవరకొండ నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పరిణామాలు హైకమాండ్కు తలనొప్పిగా మారాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని తన అనుచరులతో వాపోతున్న అగ్రనేతలు బయటకు మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. సీనియర్ నేత జానారెడ్డి, ఉత్త మ్ వంటి లీడర్లు ఇప్పటికీ నోరెత్తకపోవడం గమనార్హం.