దక్షిణాది సినీ చరిత్రలో అరుదైన మైలురాయిగా నిలవాల్సిన సూపర్ స్టార్ రజనీకాంత్ 'తలైవర్ 173' చిత్రం ఇప్పుడు అనూహ్యమైన మార్పులకు కేంద్రం బిందువుగా నిలిచింది. ఇది నాలుగు దశాబ్దాల తర్వాత కమల్-రజనీల అద్భుత కలయికకు ప్రతీక . ఈ మూవీని లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణ సంస్థ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు.. అయితే తొలుత దర్శకుడిగా ప్రకటించిన సుందర్.సి హఠాత్తుగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశగా మారింది..
సుందర్.సి నిష్క్రమణ వెనుక ఏం జరిగింది?
నిజానికి 'జైలర్ 2' తర్వాత ఈ సినిమా పనులు వేగవంతం కావాల్సి ఉంది. కానీ, దర్శకుడు సుందర్.సి ఊహించని పరిస్థితుల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రానికి డైరెక్షన్ వహించే స్థానం ఖాళీ అయ్యింది. 1997లో రజనీకాంత్తో 'అరుణాచలం', 2003లో కమల్ హాసన్తో 'అన్బే శివం' వంటి క్లాసిక్స్ తీసిన సుందర్.సి ఇలా మధ్యలో వైదొలగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణం సుందర్ చెప్పిన హారర్ జానర్ కథ రజనీకాంత్కు పూర్తి సంతృప్తి కలిగించకపోవడంతోనే ఈ మార్పు జరిగిందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఊహించని దాన్ని ఆశించండి..
దర్శకత్వం నుంచి సుందర్.సి తప్పుకోవడంపైన నటుడు, నిర్మాత కమల్ హాసన్ స్పందించారు. సుందర్.సి తన నిర్ణయానికి గల కారణాలను ఇప్పటికే పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారని చెప్పారు. అయితే, తాను నిర్మాతగా రజనీకాంత్ సంపూర్ణంగా విశ్వసించే కథతోనే సినిమా తీయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. రజనీకాంత్కు నచ్చేంత వరకు మేము కథల వేట కొనసాగిస్తాం అని చెప్పారు. ఈ సినిమాకు ఓ యువ దర్శకుడికి కూడా అవకాశం దక్కే అవకాశం ఉందని కమల్ సూచించారు. అంతే కాకుండా ఆయన వ్యాఖ్యానించిన "expect the unexpected" అనే మాట.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కు అనధికారిక ట్యాగ్లైన్గా మారిపోయింది.
►ALSO READ | NBK111: సింహాసనంపై వీర విహారం.. బాలయ్య సరసన 'మహారాణి'గా నయన్!
దర్శకుడి కుర్చీలో ధనుష్?
సుందర్.సి నిష్క్రమణతో తలెత్తిన డైరెక్టర్ స్థానం కోసం అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే, ఇటీవల నటుడు, దర్శకుడు ధనుష్ పేరు బలంగా వినిపిస్తోంది. ధనుష్ 'తలైవర్ 173' దర్శకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తతో అభిమానుల ఉత్సాహం ఉప్పొంగుతోంది. 'పా పాండి', 'రాయన్', 'ఇడ్లీ కడై' వంటి చిత్రాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న ధనుష్... సూపర్ స్టార్ రజనీకాంత్ను డైరెక్ట్ చేస్తే, అది నిజంగా ఒక 'ఫ్యాన్బాయ్ సంభవం' అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. రజనీకాంత్ మాస్ ఇమేజ్ను, ధనుష్ సహజమైన, కథాబలం ఉన్న శైలిని కలిపి ఒక వినూత్నమైన చిత్రాన్ని చూడొచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే, నిర్మాణ సంస్థ లేదా చిత్ర బృందం నుంచి దీనిపై ఎటువంటి అధికారిక ధృవీకరణ రాలేదు. దీంతో, సినీ పరిశ్రమ, ప్రేక్షకులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం, ధనుష్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందిన ప్రేమకథా చిత్రం 'తేరే ఇష్క్ మే' విడుదల కోసం సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నవంబర్ 28న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.
From the Black-and-White beginning to the Golden Era of Glory, they stand as Pillars of Tamil cinema
— Raaj Kamal Films International (@RKFI) November 9, 2025
Superstar Rajinikanth joins Kamal Haasan’s Raaj Kamal Films International,
under the direction of Sundar C
for #Thalaivar173#Pongal2027@rajinikanth @ikamalhaasan #SundarC… pic.twitter.com/8HEOZEY9W6
