
సందీప్ కిషన్ హీరోగా రంజిత్ జయకోడి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైఖేల్’. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తోంది. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ను మంగళవారం అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 3న సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లతో పాటు హిందీలో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘నువ్వుంటే చాలు’ ఫస్ట్ సింగిల్ క్యూరియాసిటీని పెంచింది. నారాయణ్ దాస్ కె నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు కలిసి నిర్మిస్తున్నారు. త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి, రాజన్ రాధామణలన్, రంజిత్ జయకోడి డైలాగ్స్ రాస్తున్నారు. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు.