పక్కాగా వచ్చేస్తానంటున్న గోపీచంద్

పక్కాగా వచ్చేస్తానంటున్న గోపీచంద్

హైదరాబాద్: స్టార్ హీరోల దగ్గర్నుంచి చిన్న హీరోల వరకు.. అందరి సినిమాలూ రిలీజ్‌‌‌‌కి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు గోపీచంద్‌‌‌‌ కూడా బరిలోకి దిగడానికి రెడీ అయ్యాడు. మారుతి డైరెక్షన్‌‌‌‌లో ‘పక్కా కమర్షియల్’ మూవీ చేస్తున్నాడు గోపీచంద్. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయనున్నట్లు  కన్‌‌‌‌ఫర్మ్ చేశారు. ‘మే 20న ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాం. కరోనా కరుణిస్తే’ అంటూ తనదైన హ్యూమర్ టచ్‌‌‌‌తో రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ని రివీల్ చేశాడు మారుతి. ఆల్రెడీ ప్రమోషన్స్‌‌‌‌ మొదలు పెట్టారు. సీతారామశాస్త్రి రాసిన టైటిల్‌‌‌‌ సాంగ్‌‌‌‌ను నిన్న లాంచ్ చేశారు. ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు హేమచంద్రతో కలిసి జోష్‌‌‌‌ఫుల్‌‌‌‌గా పాడాడు జేక్స్ బిజోయ్. ఇదో కోర్ట్ రూమ్ డ్రామా. గోపీచంద్‌‌‌‌తో పాటు హీరోయిన్ రాశీఖన్నా కూడా లాయర్‌‌‌‌‌‌‌‌గా కనిపించబోతోంది. రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.