హైదరాబాద్ సిటీ, వెలుగు: సమాజంలోని బలహీన వర్గాలకు వైద్య సేవలు అందించడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ప్రశంసనీయమని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. రాజ్భవన్లో సోమవారం డిజేబుల్ ఫౌండేషన్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, పిట్టి ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన హెల్త్ క్యాంపును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు.
దివ్యాంగులకు ఎలక్ట్రిక్ వాహనాలు, కర్రలు, వీల్చైర్లు పంపిణీ చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఎం.వీరయ్య, కలెక్టర్ హరిచందన , డాక్టర్ విజయ భాస్కర్, రెడ్ క్రాస్ చైర్మన్ భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 900 మందికిపైగా శిబిరంలో పాల్గొనగా, 71 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించారు.
