సికింద్రాబాద్, వెలుగు: పుణ్యక్షేత్రాల సందర్శన కోసం ప్రత్యేకంగా నడుపుతున్న భారత్గౌరవ్ఏడో రైలు బుధవారం సికింద్రాబాద్రైల్వేస్టేషన్నుంచి బయలుదేరింది. ఈ స్పెషల్ట్రైన్ను ఓ వృద్ధ ప్రయాణికురాలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ట్రైన్ రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తూ దేశంలోని తూర్పు, ఉత్తర భాగాల్లోని పురాతన చారిత్రక ప్రదేశాలను సందర్శింపజేస్తుంది.
మొత్తంగా 9 రోజుల్లో పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్వంటి ముఖ్యమైన ప్రదేశాలకు వెళుతుందని ఐఆర్సీటీసీ గ్రూప్ జనరల్ మేనేజర్ పి.రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రైన్ లోని ప్రయాణికులందరికీ రుద్రాక్ష మాలలు అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్అరుణ్కుమార్జైన్ పాల్గొన్నారు.