
నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. శుక్రవారంతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో టీమ్ షేర్ చేసింది. దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్లో కలుద్దాం’ అని నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చాయి. ఇక ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్గా నటించగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తున్నారు.