పర్మినెంట్ చేయాలని మూడో రోజూ సమ్మె

పర్మినెంట్ చేయాలని మూడో రోజూ సమ్మె

హైదరాబాద్‌, వెలుగు : ఔట్ సోర్సింగ్  కార్మికులను పర్మినెంట్ చేయాలని  జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో  చేపట్టిన  సమ్మె ఆదివారం మూడో రోజు కొనసాగింది. శానిటేషన్ , ఎంటమాలజీ వర్కర్స్‌తో పాటు వివిధ విభాగాల కార్మికులు పాల్గొన్నారు. 

సోమవారం నుంచి పెద్ద ఎత్తున సమ్మె నిర్వహిస్తామని  యూనియన్ ప్రెసిడెంట్ ఊదరి గోపాల్ హెచ్చరించారు. ఆదివారం ఉప్పల్ సర్కిల్​ లో సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం స్పందించేంత వరకు సమ్మె ఆగదని ఆయన స్పష్టం చేశారు.