రాజధాని రైతుల పిటిషన్ పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ

రాజధాని రైతుల పిటిషన్ పై మే 9న సుప్రీంకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులపై సుప్రీంకోర్టు జులై 11వ తేదీన విచారణ చేపట్టనుంది. చనిపోయిన పిటిషనర్స్ స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలంటూ పలువురు రైతులు ఎల్ఆర్ అప్లికేషన్ దాఖలు చేశారు. రైతులు దాఖలు చేసిన తాజా పిటిషన్ పై మే 9వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. రాజధాని అమరావతి కేసును గత విచారణలో సుప్రీంకోర్టు జులై 11వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే.