టెక్నాలజీ : టెలిగ్రామ్ అప్డేట్స్.. ఇకనుంచి డైరెక్ట్ మెసేజెస్.. ఫుల్ ప్రైవసీ !

టెక్నాలజీ : టెలిగ్రామ్ అప్డేట్స్.. ఇకనుంచి డైరెక్ట్ మెసేజెస్.. ఫుల్ ప్రైవసీ !

టెలిగ్రామ్​ యాప్ లేటెస్ట్​గా v11.12.0 అప్​డేట్​లో కొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అవేంటంటే.. మొదటిగా టెలిగ్రామ్ యూజర్లు చానెల్ అడ్మిన్స్​కి డైరెక్ట్ మెసేజ్​లు పంపొచ్చు. అందుకోసం చానెల్ సెట్టింగ్స్​లో డైరెక్ట్ మెసేజెస్​ ఆప్షన్​ ఎనేబుల్ చేయాలి. దీంతో మొబైల్ నెంబర్​ షేర్ చేయకుండానే కమ్యూనికేట్ అవ్వొచ్చు. కాబట్టి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అడ్మిన్స్​కి వచ్చిన మెసేజ్​లు ఒక స్పెషల్ ఇంటర్​ఫేస్​లో కనిపిస్తాయి. చానెల్​లోని మెసేజ్​ బబుల్​ ఐకాన్​పై ట్యాప్​ చేసి డైరెక్ట్​ మెసేజ్ చేయొచ్చు. మరొక ఫీచర్ ఏంటంటే... ఈజీగా గ్రూప్​ డిస్కషన్స్​ చేసుకునేందుకు ట్యాబ్ ఇంటర్​ఫేస్ అందుబాటులో ఉంది.

సైడ్​ బార్ లేదా టాప్ బార్ ద్వారా మాట్లాడే టాపిక్స్​ మధ్య చాలా స్పీడ్​గా స్విచ్ అవ్వొచ్చు. ఈ ఫీచర్ వాడాలంటే గ్రూప్ సెట్టింగ్స్​లో టాపిక్స్​ అనే ఆప్షన్​ని యాక్టివేట్ చేయాలి. టెలిగ్రామ్​లో వచ్చిన మూడో అప్​డేట్​తో హెడీ క్వాలిటీ ఫొటోలు సెండ్ చేయొచ్చు. నార్మల్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ పిక్సెల్​ క్వాలిటీ ఫైల్ ఉంటుంది. సైజ్ 0.5 ఎం.బికి లోపే ఉంటుంది. ఫొటో ఎడిటర్​లో ఎస్​డీ బటన్​ను ట్యాప్ చేసి హెచ్​డీకి మార్చుకోవచ్చు. లేదా అటాచ్​మెంట్ మెనూకి వెళ్లి అక్కడ సెండ్​ ఇన్​ హైక్వాలిటీ ఆప్షన్​ను సెలక్ట్ చేసుకోవాలి.