
టెలిగ్రామ్ యాప్ లేటెస్ట్గా v11.12.0 అప్డేట్లో కొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అవేంటంటే.. మొదటిగా టెలిగ్రామ్ యూజర్లు చానెల్ అడ్మిన్స్కి డైరెక్ట్ మెసేజ్లు పంపొచ్చు. అందుకోసం చానెల్ సెట్టింగ్స్లో డైరెక్ట్ మెసేజెస్ ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. దీంతో మొబైల్ నెంబర్ షేర్ చేయకుండానే కమ్యూనికేట్ అవ్వొచ్చు. కాబట్టి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అడ్మిన్స్కి వచ్చిన మెసేజ్లు ఒక స్పెషల్ ఇంటర్ఫేస్లో కనిపిస్తాయి. చానెల్లోని మెసేజ్ బబుల్ ఐకాన్పై ట్యాప్ చేసి డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. మరొక ఫీచర్ ఏంటంటే... ఈజీగా గ్రూప్ డిస్కషన్స్ చేసుకునేందుకు ట్యాబ్ ఇంటర్ఫేస్ అందుబాటులో ఉంది.
సైడ్ బార్ లేదా టాప్ బార్ ద్వారా మాట్లాడే టాపిక్స్ మధ్య చాలా స్పీడ్గా స్విచ్ అవ్వొచ్చు. ఈ ఫీచర్ వాడాలంటే గ్రూప్ సెట్టింగ్స్లో టాపిక్స్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేయాలి. టెలిగ్రామ్లో వచ్చిన మూడో అప్డేట్తో హెడీ క్వాలిటీ ఫొటోలు సెండ్ చేయొచ్చు. నార్మల్ కంటే నాలుగు రెట్లు ఎక్కువ పిక్సెల్ క్వాలిటీ ఫైల్ ఉంటుంది. సైజ్ 0.5 ఎం.బికి లోపే ఉంటుంది. ఫొటో ఎడిటర్లో ఎస్డీ బటన్ను ట్యాప్ చేసి హెచ్డీకి మార్చుకోవచ్చు. లేదా అటాచ్మెంట్ మెనూకి వెళ్లి అక్కడ సెండ్ ఇన్ హైక్వాలిటీ ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి.