భారత్– న్యూజిలాండ్ మ్యాచ్ లో వర్షం కారణంగా టాస్ డిలే

భారత్– న్యూజిలాండ్ మ్యాచ్ లో వర్షం కారణంగా టాస్ డిలే

ఈ రోజు విల్లింగ్ టన్ వేదికగా జరగబోయే భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ కు వర్షం కారణంగా టాస్ డిలే అయింది. ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సిరీస్ లో భారత జట్టుకు ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ లో తమ జట్టు ప్రదర్శన నుంచి తప్పులు తెలుసుకొని, వాటిని సరిచేసుకుంటూ ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు యువ ఆటగాళ్లు. టీ20 సిరీస్ లో ఈ నెల 20న రెండో టీ20, 22న మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.