17న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ సమావేశం

 17న కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్  పార్టీ సమావేశం

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ సమావేశం ఈనెల 17వ తేదీన ఎల్లుండి శుక్రవారం జరగనుంది. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాల సమాచారం. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తో కూడిన సంయుక్త సమావేశం జరగనున్నది.
ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిఎంఎస్ అధ్యక్షులు, డిసిసిబి అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొంటారు.