ట్రాక్టర్ తిరగబడి యువకుడి మృతి

ట్రాక్టర్ తిరగబడి యువకుడి మృతి

వర్గల్: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ తిరగబడటంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వర్గల్ మండలం, అనంతగిరి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కాయిత గణేశ్ (21) అనే వ్యక్తి గురువారం ఉదయం రోటొవేటర్ వేసుకుని తన పొలాన్ని దున్నేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం దున్నుతుండగా బురదలో ట్రాక్టర్ తిరగబడింది. దీంతో ట్రాక్టర్ కింద పడిన గణేశ్ తల, చేయి  నుజ్జయ్యాయి. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీన్ని గమనించిన గ్రామీణులు.. గణేశ్ కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు బోరుమన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

116 ఎకరాల ఊరి భూమిని కొట్టేసిన కానిస్టేబుల్

ఫుడ్​ కోసం 550 కిలోమీటర్లు జర్నీ

వారంలో ఎంగేజ్‌మెంట్.. గుండెపోటుతో యువ డాక్టర్ మృతి