రూ.1000 కోసం ఫ్రెండ్ ని చంపాడు

రూ.1000 కోసం ఫ్రెండ్ ని చంపాడు

హైదరాబాద్, వెలుగు: తన డబ్బు దొంగతనం చేశాడనే అనుమానంతో ఫ్రెండ్ ను  హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా కాస్లాబాద్ కు చెందిన జి. ఆంజనేయులు, తట్టేపల్లి రాజు ఫ్రెండ్స్. వారం కిందట మందు తాగి ఇద్దరూ ఆం జనేయులు ఇంట్లో పడుకున్నారు. తెల్లారి రాజు నిద్రలేచి వెళ్ళిపోయాడు. ఆంజనేయులు తన వెయ్యి రూపాయలు కనిపించకపోవడంతో రాజును అడిగాడు. అతను తీయలేదని చెప్పాడు. ఈ నెల 15న మళ్లీ ఇద్దరూ ఆంజనేయులు ఇంట్లో పడుకున్నారు. రాజు తన డబ్బు తీశాడన్న అనుమానంతో ఉన్న ఆంజనేయులు అతడి తలపై కర్రతో కొట్టాడు. రాజు చనిపోవడంతో డెడ్బాడీని ఇంట్లోని డ్రమ్ లో దాచాడు. తర్వాత రోజు పాడు బడ్డబావిలో పడేశాడు. అక్కడ ఆంజనేయులు పర్సు పడిపోవడంతో షాద్ నగర్ పోలీసులు దాని ఆధారంగా కేసును ఛేదించారు.