రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది ఇతడే : పెళ్లి చూపుల ముందు రోజు అర్థరాత్రి బయటకు ఎందుకొచ్చాడు..?

రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టింది ఇతడే : పెళ్లి చూపుల ముందు రోజు అర్థరాత్రి బయటకు ఎందుకొచ్చాడు..?

హైదరాబాద్ సిటీ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు.. కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర యాక్సిడెంట్ అయ్యింది. కాలిబూడిద అయిన ఈ ఘోర ప్రమాదానికి కారణం ఓ బైక్ అని తెలుసు కదా.. ఇంతకీ అతను ఎవరు.. అతని పేరు ఏంటీ.. బస్సు బైక్ ఢీకొట్టిందా.. బైక్ వచ్చి బస్సును ఢీకొట్టిందా అనే వివరాలు తెలుసుకుందాం.

పైన ఫొటో చూస్తున్నారు కదా.. ఇతనే ఆ బైకర్. పేరు శివశంకర్. కర్నూలు సిటీలోని ప్రజానగర్‌కు చెందిన కుర్రోడు. కర్నూలు సిటీకి చెందిన ఈ శివశంకర్.. అర్థరాత్రి సమయంలో తన పల్సర్ బైక్ పై చిన్నటేకూరు ఎందుకు వచ్చాడు.. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాడు అనేది కుటుంబ సభ్యులు కూడా చెప్పలేకపోతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం శివశంకర్ కు పెళ్లి చూపులు అంటే.. శుక్రవారం పెళ్లి చూపులకు వెళ్లాల్సిన శివ శంకర్.. ముందు రోజు అర్థరాత్రి 2 గంటల 30 నిమిషాల సమయంలో.. తాను ఉండే కర్నూలు సిటీలోని ప్రజానగర్ ఏరియాలోని ఇంట్లో ఉండకుండా.. 20 కిలోమీటర్ల దూరంలోని చిన్నటేకూరు ఎందుకు వెళ్లాడు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి.

హైవేపై రాంగ్ రూట్ లో వెళ్లి ప్రమాదానికి కారకుడయ్యాడు శివశంకర్. ఒక్కడి మిస్టేక్ వలన 19 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. రాంగ్ రూట్ లో పల్సర్ బైక్ పై వచ్చి బస్సును ఢీకొట్టడంతో ఎగిరి దూరంగా పడ్డాడు. కానీ బైక్ బస్సు కిందికి వెళ్లి ఇరుక్కుంది. దీంతో 300 మీటర్లు బైక్‌ను లాక్కెళ్లింది బస్సు. రోడ్డుపై బైకును ఈడ్చుకెళ్లడంతో స్పార్క్ (మంట) పుట్టి మంటలు అంటుకున్నాయి. 

►ALSO READ | బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్

దీనికి తోడు డీజిల్ల్ ట్యాంక్ లీకవడ్డంతో వెంటనే మంటలు భారీ ఎత్తున బైకుతో పాటు బస్సుకు అంటుకున్నాయి. ఏసీ బస్సు కావడంతో పూర్తిగా అద్దాలు మూసి వేసి ఉండటంతో బస్సంతా పొగ, మంటలు కమ్ముకుని ఊపిరాడక మంటల్లో కాలి చనిపోయారు ప్రయాణికులు. 

 హైదరాబాద్ నుంచి బెంగళూరు  వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఏపీ కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.  శుక్రవారం (అక్టోబర్ 24) తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో బస్సు మంటల్లో దగ్ధమైపోయింది. కల్లూరు మండలం చిన్న టేకూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. తెల్లవారు జామున 3.30 గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నారు.  21 మందికి పైగా మృతి చెందగా మరో మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సహాయక  చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.