- షాపు తాళాలు పగులగొట్టి చోరీ
సంగారెడ్డి జిల్లా జోగిపేట మండల కేంద్రంలోని బంగారం షాపులో చోరీ జరిగింది. అర్థరాత్రి టైంలో టేక్మాల్ శ్రీనివాస్ కు చెందిన షాపు తాళాలు పగలగొట్టి రెండు తులాల బంగారం, ఐదు కిలోల వెండిని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని దుండగులు. చోరీ చేస్తున్న విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని సీసీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు.