
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీ ఏడో ఫేజ్లో సోమవారం అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. డోర్ లాక్ పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు వృద్ధ దంపతులను కొట్టి, భయపెట్టి దోపిడీకి పాల్పడ్డారు. సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.3 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత పక్కింట్లో దోపిడీకి విఫలయత్నం చేశారు. కేపీహెచ్బీ పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ ఏడో ఫేజ్లోని ఎంఐజీ 11లో రిటైర్డ్ తహసీల్దార్ నాగేశ్వరరావు(90), అతని భార్య సరస్వతి(85) నివసిస్తున్నారు.
సోమవారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు డోర్ పగులగొట్టి ఇంట్లోకి వచ్చారు. వృద్ధ దంపతులపై దాడి చేసి భయపెట్టారు. సరస్వతి ఒంటి మీద ఉన్న ఆభరణాలు లాక్కున్నారు. బీరువా లాకర్ తెరిచి మరికొన్ని ఆభరణాలతో పాటు రూ.3 లక్షల నగదు దోచుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. దొంగల ఆచూకీ కోసం నాలుగు టీమ్లు గాలిస్తున్నాయి.