ఇటీవల నూతనంగా నిర్మించిన హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో భారీ చోరీ జరిగింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కేటాయించిన క్వార్టర్ నెంబర్ 305లో ఈ దొంగతనం జరిగింది. ఈ క్వార్టర్లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బంధువు అమర్ నాథ్ బాబు కుటుంబం గత కొంతకాలం నుంచి నివాసం ఉంటోంది. శుక్రవారం సాయంత్రం వీరుంటున్న క్వార్టర్లో చోరీ జరిగింది. ఈ చోరీలో 14.6 తులాల బంగారం, 10 వేలు నగదు దొంగిలించబడింది. అయితే ఈ చోరీ గురించి అబిడ్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి, నారాయణ గూడ సిఐ రమేష్ కుమార్లు మీడియాకు ఎటువంటి సమాచారం వెల్లడించకుండా గోప్యత పాటిస్తున్నారు.
క్వార్టర్స్ చుట్టూ పదుల సంఖ్యలో పోలీసులు సెక్యూరిటీగా ఉంటారు. అటువంటి స్థలంలో చోరీ కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమర్ నాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నారాయణ గూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో ఇంట్లోని పలు వస్తువులను తమ డ్రైవర్ దొంగతనం చేసినట్లు పోలీసుల పిర్యాదులో పేర్కొన్నారు. వేసిన తాళాలు వేసినట్లు ఉండడం, లోపలికి ఎవరూ రాకపోవడంతో ఇంటిదొంగ పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ ఫోన్ స్విచ్ఛాఫ్ ఉండడంతో పోలీసులు డ్రైవర్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
For More News..