కాంగ్రెస్ నుంచి టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం రేసులో ముందంజలో ఉండగా.. ఇక డిప్యూటీ సీఎం రేసులో ఆరుగురుసీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా డిప్యూటీ సీఎంలు నియమించే ఛాన్స్ ఉంది. ఒక్కరికంటే ఎక్కువ మందికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉంది. అయితే సీఎం అభ్యర్థి ఖరారైన తర్వాత డిప్యూటీ సీఎం ఎంపిక విషయం తేల్చనున్నారు.
ఏ జిల్లా నుంచి ఎవరంటే.. ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, బాలూ నాయక్, వరంగల్ నుంచి సీతక్క , కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి దామోదర రాజనర్సింహా రేసులో ఉన్నారు.
మరో వైపు సీఎం అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీకి అప్పగిస్తూ టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏక వాఖ్య తీర్మానం చేయగా తుమ్మల బలపరిచారు. దీంతో సీఎం అభ్యర్థిని ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ కానుంది.