తల్లిని కాపాడబోయి కరెంట్​ షాక్​తో కొడుకు మృతి

తల్లిని కాపాడబోయి కరెంట్​ షాక్​తో కొడుకు మృతి

వేంసూరు, వెలుగు : ఖమ్మం జిల్లా వేంసూర్​ మండలంలో కరెంట్​షాక్​కు గురైన తల్లిని కాపాడబోయి కొడుకు మృతి చెందాడు. భీమవరం గ్రామానికి చెందిన ఐనంపూడి సరోజిని కొడుకు వెంకటేశ్వరరావు(28). డెయిలీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. సోమవారం ఉదయం సరోజిని ఇంట్లోని ఫ్యాన్ స్విచ్ ఆన్​చేయబోగా కరెంట్​షాక్​కొట్టింది. గమనించిన వెంకటేశ్వరరావు తల్లిని కాపాడే ప్రయత్నంలో పక్కనే ఉన్న కర్రతో తల్లి చేయి మీద కొట్టాడు. సరోజిని కింద పడిపోయింది.

ALSO READ:ఆఫీసర్ల తప్పులు.. రైతులకు తిప్పలు

అయితే అప్పటికే ఆ కర్ర తడిచి ఉండడం, తల్లిని కాపాడే క్రమంలో కర్ర పోయి కరెంట్ ​బోర్డు మీద పడింది. వెంకటేశ్వరరావు షాక్​కు గురై కుప్పకూలాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సత్తుపల్లిలోని ప్రభుత్వ హాస్పిటల్‌‌కు తరలించారు. మృతదేహానికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నివాళులర్పించారు.