- కొత్తగా ఎవరినీ తీసుకోవద్దని ఆయా డిపార్ట్మెంట్లకు సర్కారు ఆదేశం!
- ఎమర్జెన్సీ అయితే సీఎం ఆమోదానికి పంపాలని సూచన
- రాష్ట్రంలో ఏయే శాఖల్లో ఎంత మంది ఉన్నారనే వివరాలపై ఆరా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను రిక్రూట్చేయాల్సిన ప్రభుత్వం.. వాటికి నోటిఫికేషన్లు ఇవ్వకపోగా.. ఇప్పుడున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను కూడా తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతినెలా జీతాల సమస్య వస్తోందనే కారణాలతో పోస్టులు కుదించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి ఔట్సోర్సింగ్పోస్ట్క్రియేట్చేయొద్దని అన్ని శాఖలకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఏదైనా అత్యవసరమైతే సీఎం ఆమోదానికి పంపాల్సిందేనని స్పష్టం చేసింది. అదే టైంలో ఇప్పుడున్న ఔట్సోర్సింగ్ఉద్యోగాలను మరింత కుదించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు ? అక్కడ అవసరాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారనే దానిపై వివరాలు తీస్తున్నారు. జీతాల సమస్యలపై ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్లలో ఔట్ సోర్సింగ్ఉద్యోగులను తీసేశారు. ఇప్పుడు ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తుండటంతో ఆ ఎంప్లాయీస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ పై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఫైనాన్స్డిపార్ట్మెంట్ ఆఫీసర్లు చెప్తున్నారు.
ఇప్పటికే 20 వేల మంది తీసేసిన్రు
రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కింద 1.70 లక్షల మంది పనిచేస్తున్నట్లు ఇటీవల ఫైనాన్స్, జీఏడీ డిపార్ట్మెంట్లు లెక్కలు తీశాయి. ఇప్పుడు ఇందులో ఏ డిపార్ట్మెంట్, ప్రభుత్వ సంస్థల్లో ఎంత మంది పనిచేస్తున్నరు ? అక్కడ అవసరాలు ఏంటి అనే వివరాలు తీస్తున్నారు. ఈ ఆరేండ్లలో దాదాపు 20 వేల మంది ఉద్యోగాలను ప్రభుత్వం తీసేసింది. నిరుడు లాక్డౌన్ తర్వాత ఆర్థిక లోటు పేరుతో వేల సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ను తొలగించారు. గతంలో ఉపాధి హామీ, భగీరథ, హార్టికర్టిల్చర్ డిపార్ట్ మెంట్లలో సుమారు 10 వేల మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో మరో10 వేల మందిని ఈ ఏడాదిలోనే తీసేశారు. ఇప్పుడు మరో 20 వేల మందిని తీసేసే ప్లాన్ చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఖాళీల్లో చూపరు.. ఉన్నవారిని తీసేస్తరు
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ఎంప్లాయీస్ విషయంలో సర్కారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. రాష్ట్రంలో 1.70 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఈ పోస్టులను ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల లెక్కలో చూపడం లేదు. మొత్తం ఖాళీలు 60 నుంచి 70 వేలే ఉన్నట్లు చూపెడుతున్నరు. ఎప్పటికప్పుడు అవసరాలు తీరగానే ఔట్సోర్సింగ్ఉద్యోగులను తొలగించడమే తప్ప.. వారిని పర్మినెంట్చేయడం గానీ, రెగ్యులర్ పోస్టులు రిక్రూట్చేయడం గానీ జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.