
మునుగోడు, వెలుగు: తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మునుగోడు బైఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి కానుకగా ఇవ్వాలని పీసీసీ వైస్ప్రెసిడెంట్ మల్లు రవి, వర్కింగ్ప్రెసిడెంట్ అంజన్కుమార్యాదవ్, కాంగ్రెస్పార్టీ బై ఎలక్షన్నియోజకవర్గ ఇన్చార్జి దామోదర్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కాంగ్రెస్జిల్లా నాయకులతో కలిసి చండూరులో నిర్వహించే బహిరంగసభ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మునుగోడు మొదటి నుంచి కాంగ్రెస్పార్టీకి కంచుకోటగా ఉందన్నారు. మధ్యలో వచ్చిన రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం వల్ల జరిగే నష్టమేమీ లేదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. దళితులకు 3ఎకరాల భూమి ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో నల్గొండ, యాదాద్రి డీసీసీ ప్రెసిడెంట్లు శంకనాయక్, అనిల్ రెడ్డి, పున్న కైలాష్, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడులో కాంగ్రెస్జెండా ఎగరేస్తం
చౌటుప్పల్, వెలుగు: మునుగోడులో మళ్లీ కాంగ్రెస్జెండా ఎగరేస్తామని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గురువారం చౌటుప్పల్ లోని కాంగ్రెస్పార్టీ ఆఫీస్లో చౌటుప్పల్, నారాయణపురం మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు మండలాల్లోని కాంగ్రెస్పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే కొత్త కమిటీలు నియమిస్తామని తెలిపారు. రాజకీయ జన్మనిచ్చిన తల్లి లాంటి కాంగ్రెస్పార్టీని రాజగోపాల్ రెడ్డి మోసం చేశాడని మండిపడ్డారు. పార్టీ ఎన్నో అవకాశాలిచ్చినా.. కాంట్రాక్టుల కోసం పార్టీ వీడారని విమర్శించారు. ఈటల రాజేందర్ ను సీఎం కేసీఆర్అహంకారంతో పార్టీ నుంచి బయటకు పంపితే, హుజూరాబాద్ప్రజలు తిరిగి గెలిపించుకున్నారని, కానీ రాజగోపాల్ రెడ్డికి పార్టీలో ఎలాంటి అవమానాలు జరగలేదని, ఆయనను మునుగోడు ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు.