హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశృతులు

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశృతులు

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సంజీవయ్య పార్క్ వద్ద ఓ వ్యక్తి లారీ కింద పడి చనిపోయాడు. గణేష్ విగ్రహం నిమజ్జనం చేయడానికి వచ్చిన వ్యక్తి లారీ కింద పడి మృతిచెందాడు. మృతుడు కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన ప్రణీత్ గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రణీత్ డెడ్ బాడీని సికింద్రాబాద్ గాంధీ మార్చురీకి తరలించారు. సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వెంట నిమజ్జనానికి వెళ్లిన ప్రణీత్ ప్రమాదవశాత్తు లారీ కింద పడి చనిపోయాడు. 

మరో ప్రమాదంలో బాలుడు మృతి

మరో ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. బషీర్‌బాగ్ ఫ్లై ఓవర్ సమీపంలో లారీ టైర్ కింద పడి ఆయుష్ అనే బాలుడు మృతి చెందాడు.  సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటున్న రాజశేఖర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి గణేస్ నిమజ్జనం చేయడానికి బైక్ పై వెళ్తుండగా.. వాహనం స్కిడ్ కావడంతో కిందపడిపోయారు. దీంతో బైక్ పై నుండి కిందపడ్డ ఆయుష్ పై నుండి టస్కర్ వాహనం వెళ్లింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాబును నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ ఆయుష్ చనిపోయాడు. బాలుడు తల్లిదండ్రుల సొంతూరు బెల్లంపల్లి.