గాంధీలో డాక్టర్​చేతివాటం! విచారణకు స్పెషల్ కమిటీ

గాంధీలో డాక్టర్​చేతివాటం! విచారణకు స్పెషల్ కమిటీ

పద్మారావునగర్, వెలుగు: సర్జరీ చేసేందుకు గాంధీలోని ఓ డాక్టర్ పేషెంట్​నుంచి డబ్బు డిమాండ్​చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్న సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు నిగ్గు తేల్చేందుకు నలుగురు హెచ్ఓడీలతో స్పెషల్​కమిటీని నియమించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా మధిర కు చెందిన వెంకట్​రెడ్డి అనారోగ్య సమస్యతో గాంధీలో చేరాడు. సర్జరీ చేయడానికి ఆర్దోపెడిక్​ డిపార్ట్​ మెంట్ కు చెందిన వైద్యాధికారి రూ.10 వేలు డిమాండ్​చేశాడని, విధిలేక సదరు వ్యక్తి గూగుల్ పే ద్వారా ఆ మొత్తం  చెల్లించినట్లు పేషెంట్ భార్య గోవిందమ్మ సూపరింటెండెంట్​ప్రొ.రాజారావుకు లెటర్​రాశారు. దీంతో విచారణ కమిటీని నియమించారు.