మళ్లీ తమ పేరిట పట్టాలు మార్చాలని వినతి పత్రాలు సమర్పిస్తున్నరు

మళ్లీ తమ పేరిట పట్టాలు మార్చాలని వినతి పత్రాలు సమర్పిస్తున్నరు

కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం 

హైదరాబాద్, వెలుగు: ధరణిలో ఉన్న డమ్మీ ఖాతాల వివరాలను సేకరించాలని కలెక్టర్లను ఛీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్( సీసీఎల్ఏ) డైరెక్టర్ రజత్ కుమార్ షైని ఆదేశించారు. 2017లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పట్టాదారులు ఎవరో తెలియని భూములకు 5000, 9999, 100000 లాంటి ఖాతా నంబర్లును ఇచ్చి పట్టాదార్​కాలమ్-లో శ్రీ శ్రీ, పట్వారీ, కపల్లి, హౌస్​ సైట్స్, సర్కార్ భూమి లాంటి పేర్లను ఎంట్రీ చేశారు. ధరణి పోర్టల్ వచ్చాక ఈ భూములకు సంబంధించిన పట్టాదారులు.. మళ్లీ తమ పేరిట పట్టాలు మార్చాలని అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ముందుగా ఇలాంటి భూముల వివరాలు సేకరించే పనిలో పడింది.