పోడు పట్టాల కోసం గిరిజనుల ఆందోళన.. హైవేపై రాస్తారోకో

పోడు పట్టాల కోసం గిరిజనుల ఆందోళన.. హైవేపై రాస్తారోకో

ఆమనగల్లు, వెలుగు: పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని కోరుతూ కడ్తల్ మండలం పల్లె చెల్కతండాకు చెందిన గిరిజనులు సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, హైవేపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తండాకు చెందిన 300 కుటుంబాలు 3 తరాలుగా పోడు భూములను సాగు చేసుకుంటున్నామని చెప్పారు.

కొన్నేండ్లుగా అటవీశాఖ అధికారులు తమ ఇండ్లను ధ్వంసం చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. తాము సాగు చేస్తున్న భూములకు హక్కులు కల్పించాలని కోరారు. అనంతరం తహసీల్దార్, జడ్పీటీసీకి వినతిపత్రం అందజేశారు. సర్పంచ్  లోకేశ్​నాయక్, గిరిజనులు పాల్గొన్నారు.