బషీర్బాగ్, వెలుగు: కాచిగూడ రైల్వే స్టేషన్లో రైలు దిగుతున్న ప్రయాణికుడి నుంచి మొబైల్ను లాక్కొని దొంగ పరారయ్యాడు. మహారాష్ట్రకు చెందిన మహాదేవ్ గుంగు(37) షాద్ నగర్ లో కాచిగూడ–గుంటూరు రైలు ఎక్కాడు. బుధవారం కాచిగూడ రైల్వే స్టేషన్ లో దిగుతుండగా ఈ సంఘటన జరిగింది. మరో ఘటనలో సర్టిఫికెట్లు ఉన్న బ్యాగ్ను దొంగలు ఎత్తుకెళ్లారు.
ఆసిఫాబాద్కు చెందిన సానిత్ కుమార్(25) మహారాష్ట్రలోని నాందేడ్ లో రైలు ఎక్కాడు. ఉమ్రి స్టేషన్వద్ద అతని బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. తిరుమలగిరికి చెందిన జోహార్ రంగు నాలా(48) తన భార్యతో కలిసి వడోదరలో కాచిగూడకు రావడానికి రైలు ఎక్కారు. నిజామాబాద్ వద్ద అతని భార్య హ్యాండ్ బ్యాగు దొంగలు ఎత్తుకెళ్లారు. ఆ బ్యాగులో ఐదు గ్రాముల బంగారు రింగు, రూ.4 వేల నగదు ఉన్నట్లు బాధితుడు తెలిపారు.
ఈ ఘటనపై బాధితుల ఇచ్చిన ఫిర్యాదుతో కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
