- పోలీసులు, సఖీ సెంటర్నిర్వాహకులకు నోటీసులు
నారాయణపేట, వెలుగు: దొంగతనం చేసిందనే ఆరోపణతో ఓ బాలికపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లి వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13) టౌన్లో చోరీ చేసిందనే ఆరోపణతో 50 రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక సఖీ సెంటర్లో ఉంచి విచారిస్తామని చెప్పారు. బాలిక తల్లిని కూడా 4 రోజులు అక్కడే ఉంచారు. చోరీ చేసిన డబ్బులు ఇవ్వాలని అడిగారు. గ్రామ పెద్దలు వచ్చి పోలీసులతో మాట్లాడినా బాలికను విడిచి పెట్టలేదు. దొంగతనం చేసినట్లైతే వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉండగా అలా చేయలేదు. పైగా 18 ఏండ్లు పైబడిన వారి సంరక్షణ కోసం పెట్టిన సఖీ సెంటర్లో 13 ఏండ్ల బాలికను ఉంచారు. ఈ విషయంపై జిల్లా కేంద్రంలోని చైల్డ్ లైన్ఆఫీసర్అశోక్ శ్యామల స్పందిస్తూ చోరీ ఆరోపణతో నారాయణపేట పోలీసులు బాలికను సఖీ సెంటర్లో ఉంచారని, ఇంటరాగేషన్ టైంలో చిన్నారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు తమ విచారణలో తేలిందన్నా రు. ఇందులో సెంటర్ నిర్వాహకుల పాత్ర ఉన్నట్లు తెలిసిందన్నారు. ప్రస్తుతం బాలికను వేరే ప్లేస్ లో ఉంచి ప్రొటెక్షన్ ఇస్తున్నామన్నారు. ఎస్సై, సీఐ, సఖీ సెంటర్ నిర్వాహకులు మొత్తం10 మందికి నోటీసులు అందజేసినట్లు చెప్పారు.