కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు: వైఎస్ షర్మిల

కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదు: వైఎస్ షర్మిల

కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాదని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. హన్మకొండ జిల్లా కమలాపురం మండలం శనిగరం గ్రామంలో ప్రారంభమైన పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిల.. ఇది దొరల రాజ్యం...దొంగల ప్రభుత్వమని ఆరోపించారు. ఇది దోపిడీ రాజ్యం... రౌడీల రాజ్యమన్నారు. పోలీసులను జీతగాళ్ళలాగా వాడుకొని దోపిడీలు చేసే రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులు డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ ప్రభుత్వముందన్నారు.

బంగారు తెలంగాణ అని పేదవారికి బ్రతుకు లేని తెలంగాణ చేశారని షర్మిల విమర్శించారు. ఏ వర్గాన్ని ఆదుకొనే దిక్కు లేదన్న ఆమె.. రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరిహారం ఇచ్చే దిక్కు లేదన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు చనిపోతుంటే ఆపడం చేతకాని ప్రభుత్వమిది అని షర్మిల వ్యాఖ్యానించారు.