
‘కార్తికేయ 2’తో ప్యాన్ ఇండియా సక్సెస్ను అందుకున్న అనుపమ పరమేశ్వరన్.. మరోసారి నిఖిల్తో కలిసి నటించిన చిత్రం ‘18 పేజెస్’. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనుపమ చెప్పిన విశేషాలు..
‘ఫస్ట్ లాక్డౌన్ టైమ్లో సూర్య ప్రతాప్ ఈ కథ చెప్పారు. వినగానే ఎగ్జైటింగ్గా అనిపించి ఓకే చెప్పాను. ‘కార్తికేయ 2’కి ముందే సైన్ చేశా. నిఖిల్తో ఈ రెండు సినిమాల జర్నీ చాలా హ్యాపీగా ఉంది. ‘కార్తికేయ 2’ బిగ్ హిట్ అవ్వడంతో మా పెయిర్కు మంచి పేరొచ్చింది. ‘18 పేజెస్’ కూడా అలాగే నచ్చుతుంది. ఇప్పటివరకూ నేను నటించిన లవ్స్టోరీస్లో ఇది నా ఫేవరెట్ మూవీ. ఇందులో నేను పోషించిన ‘నందిని’ క్యారెక్టర్ చాలా టిపికల్గా ఉంటుంది. ఫేస్ బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న టైమ్లో వాటన్నింటికీ దూరంగా, అసలు మొబైలే వాడని ఓ ఇన్నోసెంట్ గర్ల్ క్యారెక్టర్లో నటించా. ఈ పాత్ర నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. సుకుమార్ గారి ‘రంగస్థలం’లో చాన్స్ మిస్ అయినప్పుడు బాధ పడ్డా. మళ్లీ ఇప్పుడు ఆయన బ్రెయిన్ నుండి పుట్టిన ఈ పాత్రలో నటించడం హ్యాపీ. అయన రైటింగ్స్లో ఇది సిగ్నేచర్ క్యారెక్టర్ అవుతుంది. ట్రైలర్లో చూసిన వాళ్లంతా ఆ క్యారెక్టర్ గురించి చాలా ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ప్యూర్ లవ్ స్టోరీ కనుక అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా తరువాత రైటర్ లక్ష్మీ భూపాల ప్రొడక్షన్లో ‘మరీచిక’, జయం రవితో సైరన్, అలాగే రవితేజ గారితో కార్తీక్ ఘట్టమనేని తీస్తున్న ‘ఈగల్’ చిత్రాలలో నటిస్తున్నా. హీరోయిన్గా ఉన్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక డైరెక్షన్ చేస్తా. కొన్ని స్టోరీ లైన్స్ ఉన్నాయి. కచ్చితంగా వాటిలో మాత్రం నేను నటించను’.