కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం

కిటకిటలాడిన కొమురవెల్లి మల్లన్న ఆలయం

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం కావడంతో భక్తులు ఎక్కువగా రావడంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. ఈ సందర్భంగా భక్తులు మల్లన్నకు బోనం సమర్పించి, పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలు తీర్చాలని గంగరేగు చెట్టుకు ముడుపులు కట్టి వేడుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. 

అనంతరం మల్లన్న కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి కల్లు, బెల్లం సాకపెట్టి బోనం సమర్పించారు. భక్తులకు కావల్సిన అవసరాలను ఆలయ ఈవో వెంకటేశ్, ఏఈవో శ్రీనివాస్, ప్రధానార్చకుడు మహదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.