
వేములవాడ శ్రీరాజ రాజేశ్వరి స్వామి ఆలయం పరిసరాల్లో వెయ్యికోళ్ళు చనిపోవడం కలకలం రేపుతోంది. మేడారం జాతర సందర్భంగా 15 రోజులుగా వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు. మేడారం దర్శనానికి ముందు రాజన్నకు పూజలు నిర్వహిస్తారు.
ఇక్కడి బద్దీ పోచమ్మ అమ్మవారికి బోనం మొక్కులతో పాటు కోళ్ళు, గొర్రెలను బలి ఇస్తారు. ఆలయ పరిసరాల్లో వెలసిన చికెన్ సెంటర్లలో బుధవారం ఉదయం వెయ్యి కోళ్ళు దాకా చనిపోయాయి. వైరస్ సోకిందేమోనని భావిస్తున్నారు. దీంతో భక్తులు భయపడుతున్నారు.