సింగర్ సునీత భర్తకు బెదిరింపులు..

సింగర్ సునీత భర్తకు బెదిరింపులు..

సింగర్ సునీత భర్తకు బెదిరింపులు వచ్చాయి. ఓ వ్యక్తి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. తనకు ప్రాణహాని ఉందంటూ సునీత భర్త రామ్ వీరపనేని పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళ్తే..

లక్ష్మణ్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నట్లు రామ్ వీరపనేని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను టాలీవుడ్ నిర్మాతల కౌన్సిల్‌ సభ్యుడినని ఫోన్‌కు మెసేజ్ పంపినట్లు వెల్లడించాడు. తనతో మాట్లాడాలని , వ్యక్తిగతంగా కలుద్దామని లక్ష్మణ్ తెలపడంతో.. తెలియని మనుషులతో తాను మాట్లాడనని బదులిచ్చినట్లు రామ్ తెలిపాడు. అయినా లక్ష్మణ్ వరుసపెట్టి మెసేజ్ లతో వేధించాడని...తాను వాటిని పట్టించుకోకుండా, అత్యవసరం అయితే తన మనుషులను కలవాలని చెప్పినట్లు వెల్లడించాడు.  అందుకు లక్ష్మణ్ ఒప్పుకోకుండా, ‘నీతోనే పనుంది’ అని చెప్పడంతో.. తాను లక్ష్మణ్ ఫోన్ నంబరును బ్లాక్ చేసినట్లు చెప్పాడు. ఈ సమయంలో  లక్ష్మణ్ కొత్త నంబరుతో మళ్లీ మెసేజ్ లు పెట్టడం ప్రారంభించాడని... వ్యక్తిగతంగా కలవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించడం మొదలుపెట్టాడని రామ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. లక్ష్మణ్ వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని రామ్ ఆందోళన వ్యక్తం చేశాడు. 

దాదాపు రెండేళ్ల క్రిందట సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సునీత, మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని పెళ్లాడింది. అప్పటినుంచి ఈ ఇద్దరికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.