ములకలపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసులో .. వన్య ప్రాణులను వేటాడిన ముగ్గురు అరెస్ట్

ములకలపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసులో .. వన్య ప్రాణులను వేటాడిన ముగ్గురు అరెస్ట్
  • నాటు తుపాకీ స్వాధీనం.. పరారీలో మరొకరు  
  • ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ వెల్లడి

ములకలపల్లి, వెలుగు: వన్య ప్రాణులను వేటాడిన ముగ్గురిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి ఫారెస్టు రేంజ్ ఆఫీసులో బుధవారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్ మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. ములకలపల్లి మండలంలోని పెనగడప రిజర్వ్ ఫారెస్ట్, చాపరాలపల్లి బీట్ పరిధిలోని 24వ కంపార్ట్ మెంట్ అభయారణ్యంలో కొందరు వేటగాళ్లు నాటు తుపాకీతో అడవి జంతువులను వేటాడుతున్నారనే సమాచారం అందింది. 

ఈనెల14న స్థానిక అటవీ అధికారులు దాడులు చేసి ముగ్గురిని పట్టుకుని నాటు తుపాకీ స్వాధీనం చేసుకోగా.. మరొకరు పరార్ అయ్యారు.  నిందితుల్లో ఏపీలోని వేలేరుపాడు మండలం కమ్మరిగూడెంకు చెందిన కుంజా విష్ణు, అశ్వారావుపేట మండలం నందిపాడుకు చెందిన కుంజా రామకృష్ణతో పాటు మండలంలోని కుమ్మరిపాడుకు చెందిన పద్దం సీతారాములు, పద్దం వినోద్ ఉన్నారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవికిరణ్​ తెలిపారు.