జెండా స్తంభం పట్టుకోగానే కరెంట్ షాక్.. ముగ్గురు చిన్నారులు మృతి

జెండా స్తంభం పట్టుకోగానే కరెంట్ షాక్.. ముగ్గురు చిన్నారులు మృతి

ప్రకాశం  జిల్లాలో  విషాదం  చోటు  చేసుకుంది.  సంతమాగుళూరు  మండలం  కొప్పరంలో  విద్యుత్  షాక్  తగిలి  ముగ్గురు  విద్యార్ధులు  చనిపోయారు.  మరో ఇద్దరు గాయపడ్డారు. గ్రామంలోని  వైసీపీ  దిమ్మె  దగ్గర   షేక్  పఠాన్,  షేక్ హసన్,  పఠాన్  అమర్  అనే విద్యార్ధులు  ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది . విద్యుత్  తీగలకు  జెండా  రాడ్  తగలడంతో ముగ్గురూ  అక్కడికక్కడే చనిపోయారు. వీరంతా  స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు.  ముగ్గురు  చిన్నారులు  చనిపోవడంతో  ఆ గ్రామంలో  విషాద  చాయలు  అలుముకున్నాయి.