- గంటసేపు విలవిలలాడిన 20 మంది కరోనా రోగులు
- కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో ఘటన
హైదరాబాద్: ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. మరికొందరి పరిస్థితి విషమంగా మారింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు మృతి చెందారు. కింగ్ కోఠి హైదరాబాద్ జిల్లా ఆసుపత్రి లో కొద్దిసేపటి క్రితం జరిగిందీ ఘటన. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడ్డారు. 20మంది కరోనా రోగులు సుమారు గంటసేపు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు లెక్కగట్టారు. ఈ ఘటనలో ముగ్గురు కరోనా పేషేంట్ లు మృతి చెందారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్ లో ఆక్సిజన్ అయిపోవడంతో మరో ఆక్సిజన్ ట్యాంక్ రావటానికి ఆలస్యం కావడంతో ఈ సమస్య తలెత్తింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నుంచి రోజు వచ్చే ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్... డ్రైవర్ కు అడ్రస్ తెలియకపోవడంతో మొదటగా ఉస్మానియా ఆసుపత్రి వెళ్లాడు. వెంటనే విషయం తెలుసుకున్న నారాయణ గూడ పోలీసులు ట్యాంకర్ ను కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. ఆక్సిజన్ అయిపోయే వరకు ఆక్సిజన్ ని ఫిల్ చేయకుండా నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని... భాదిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేసారు. ప్రస్తుతానికి ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతో అధికారులు ఆక్సిజన్ ను ఫిల్లింగ్ చేశారు.