అయ్యో పాపం: రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి

అయ్యో పాపం: రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి

పశ్చిమ బెంగాల్లో రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతి చెందాయి. అలీపూర్దూర్ జిల్లలోని రాజభత్ ఖావావద్ద అడవులగుండా వెళ్తున్నపట్టాలు దాటుతుండగా సోమ వారం (నవంబర్ 27) గూడ్స్ రైలు ఢీకొని మూడు ఏనుగులు మృతిచెందాయని రైల్వే అధికారులు తెలిపారు. 

సోమవారం ఉదయం 7 .20 గంటల సమయంలో ఖాళీ గూడ్స్ రైలు అలీపుర్ దువార్ నుంచి సిలిగురికి వెళుతుండదగా ఏనుగులను ఢీకొట్టిందని తెలిపారు. ఈ ఘటనలో రెండు చిన్న ఏనుగులతో సహా మూడు ఏనుగులు మృతిచెందాయని రైల్వే అధికారులు చెప్పారు. 

సంఘటన జరిగిన రాజభట్ ఖావా- కల్చిని సెక్షన్ లో ఐడీఎస్ వ్యవస్థ ఇన్ స్టాల్ చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు రైల్వే అధికారులు.