కూకట్పల్లిలో ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్టు

కూకట్పల్లిలో ముగ్గురు గంజాయి విక్రేతలు అరెస్టు

కూకట్​పల్లి, వెలుగు:  గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూకట్​పల్లి పోలీసులు అరెస్టు  చేశారు.  మూసాపేట పరిధిలోని రెయిన్​బోవిస్టాలో వాచ్​మెన్​గా పని చేస్తున్న బీహార్​కు చెందిన ప్రశాంత్​కుమార్​, నీరల్​కుమార్​, చందన్​కుమార్​తో కలిసి కొంతకాలంగా గంజాయి విక్రయిస్తున్నారు. 

బుధవారం పోలీసులు అనుమానంతో వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. నిందితుల నుంచి పో లీసులు కిలో డ్రై గంజాయి, ఒక కారు,  మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.