
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకే రోజు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందడం విషాదంగా మారింది. గురువారం (జూన్ 19) కోతులను తరుముతూ ఒకరు, కెనాల్ లోకి కారు దూసుకెళ్లటంతో ఇద్దరు చనిపోయారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లాయిపల్లి వద్ద ఘోర ప్రమాదం సంభవించింది. పోచారం కెనాల్ లోకి కారు దూసుకు వెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారులో ప్రయాణిస్తుండగా కారు అదుపుతప్పి కెనాల్ లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు యువకులు ఉన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట నుండి నర్సింగ్ రావు పల్లి కి వెళ్తుండగా ఘటన జరిగింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరోవైపు నిజామాబాద్ జిల్లా ఇందలవాయి మండలం గంగారం తండా మరో విషాద ఘటన చోటు చేసుకుంది. కోతులను తరుముతూ భగవాన్ లాల్ చనిపోయాడు. కోతులను తరిమే క్రమంలోవిద్యుత్ షాక్ తో చెందాడు. ఐరన్ పైప్ సహాయంతో కోతులను తరుము తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది.
నిజామాబాద్ ఆర్టీసీ కాలనీలో కారు- టిప్పర్ ఢీ.. భారీ ట్రాఫిక్ జాం:
నిజామాబాద్ పట్టణంలో కారు, టిప్పర్ ఢీకొనటంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. డ్రైవింగ్ స్కూల్ కారును రోడ్డుపై అతి వేగంగా వెళ్తున్న ఓ మొరం టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదం ప్రమాదం జరిగింది. దీంతో నిజమాబాద్-ఆర్మూర్ మార్గంలో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. జీజీఆర్ సప్లయర్స్ టిప్పర్ గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఎవరికి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఉపిరి పీల్చుకున్నారు.