మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో డిసెంబర్ 22న ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం ఎక్స్ రోడ్ దగ్గర కూలీలతో వెళ్తోన్న బొలెరో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మహారాష్ట్రకు చెందిన కూలీలు నాట్లు వేయడానికి కరీంనగర్ లోని సుల్తానాబాద్ కి బొలెరో వాహనంలో వస్తుండగా వెనుక నుంచి వస్తోన్న లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో 22 మంది కూలీలు ఉన్నారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
