భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంట‌ర్.. ముగ్గురు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులకు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జ‌రిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఒక 8 mm రైఫిల్, బ్లాసింగ్ కు ఉప‌యోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్ నుంచి పలువురు మావోయిస్టులు తప్పించుకున్నారని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్పీ సునీల్‌ దత్‌ తెలిపారు. మృతులు శబరి ఏరియా దళ సభ్యులుగా గుర్తించినట్లు వెల్లడించారు.