ఒక ఫ్లాప్ దర్శకుడు.. ముగ్గురు మెగా హీరోలు.. ప్రాజెక్టు ఎప్పుడు?

ఒక ఫ్లాప్ దర్శకుడు.. ముగ్గురు మెగా హీరోలు.. ప్రాజెక్టు ఎప్పుడు?

సురేందర్ రెడ్డి(Surendar reddy).. ఈ స్టార్ డైరెక్టర్ ఏజెంట్(Agent) ప్లాప్ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయాడు. అఖిల్ అక్కినేని(Akhil akkineni) హీరోగా వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ దర్శకుడి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఎఫెక్ట్ తో ఈ దర్శకుడితో సినిమాలు చేసేందుకు మేకర్స్ భయపడుతున్నారనే వార్తలు వినిపించాయి. 

కానీ.. అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) తో తన నెక్స్ట్ సినిమాను ప్రకటించి అందరికీ షాకించ్చాడు. అయితే గత సంవత్సరం అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు మొదలుకాలేదు. దీంతో ఈ దర్శకుడి కెరీర్ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక రీసెంట్ గా మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) తో సురేందర్ రెడ్డి సినిమా చేయనున్నాడనే వార్తలు కూడా వచ్చాయి కానీ.. అది కూడా రూమర్ గానే మిగిలిపోయింది. ఇక తాజాగా అల్లు అర్జున్(Allu Arjun), రామ్ చరణ్(Ram charan) పేర్లు వినిపిస్తున్నాయి. 

అల్లు అర్జున్ విశయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ హీరో.. ఆ తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనాతో మూవీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ అవడానికి కనీసం రెండేళ్ళైనా పడుతుంది. కాబట్టి ఈ ఇద్దరు హీరోలతో సురేందర్ రెడ్డి సినిమా చేయడం ఇప్పట్లో కష్టమే అని చెప్పాలి. మరి ఇన్ని ఆంటంకాల మధ్య సురేందర్ రెడ్డి తరువాతి సినిమా కోసం ఏ హీరో అవకాశం ఇస్తారో చూడాలి.