భారీ వర్షాలతో మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి

భారీ వర్షాలతో మట్టి మిద్దె కూలి ముగ్గురు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి మిద్దె కూలి ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందారు. గండీడ్ మండలం పగిడ్యాల్ గ్రామంలో మంగళవారం అర్దరాత్రి ఈ ఘటన జరిగింది. మృతులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంటి పై కప్పు కూలి పడింది. దాంతో శరణమ్మ (38), ఆమె ఇద్దరు కూతుళ్లు భవాని (13), వైశాలి (9) మృతి చెందారు. ఈ ప్రమాదంతో కుటుంబసభ్యులు తీవ్ర దుఖంలో మునిగిపోయారు. ఒకేసారి ముగ్గురు చనిపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎస్పీ రెమా రాజేశ్వరి, ఆర్డీవో శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

For More News..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

భర్త మరియు పిల్లలను చంపి సూసైడ్ చేసుకున్న లేడీ డాక్టర్

కోలుకుంటున్న ప్రణబ్ ముఖర్జీ