రాష్ట్రంలో గురువారం కొత్తగా మరో 15 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1122కు చేరిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ నమోదైన కేసుల్లో 12 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారే కాగా.. మరో ముగ్గురు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారని తెలిపింది. ఈ ఒక్క రోజులో 45 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 693 మందికి చేరింది. మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 29 మంది మరణించారు. ప్రస్తుతం 400 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మూడు జిల్లాల్లో కరోనా లేదు
ఇప్పటి వరకు రాష్ట్రంలో మూడు జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో అసలు పాజిటివ్ కేసులే రాలేదు.
గడిచిన 14 రోజులుగా 22 జిల్లాల్లో కేసుల్లేవ్..
రాష్ట్రంలో గడిచిన 14 రోజులుగా 21 జిల్లాల్లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆ జిల్లాలివే..
- కరీంనగర్
- సిరిసిల్ల
- కామారెడ్డి
- మహబూబ్ నగర్
- మెదక్
- భూపాలపల్లి
- సంగారెడ్డి
- నాగర్ కర్నూల్
- ములుగు
- పెద్దపెల్లి
- సిద్దిపేట
- మహబూబబాద్
- మంచిర్యాల
- భద్రాద్రి
- వికారాబాద్
- నల్లగొండ
- ఆసిఫాబాద్
- ఖమ్మం
- నిజామాబాద్
- ఆదిలాబాద్
- సూర్యాపేట్
- నారాయణపేట్