ఐటీ కారిడార్​లో మూడు కొత్త ట్రాఫిక్​ సెక్టార్లు

ఐటీ కారిడార్​లో మూడు కొత్త ట్రాఫిక్​ సెక్టార్లు
  • సిబ్బందిపై వర్క్​ ప్రెజర్ తగ్గించేందుకు ప్లాన్

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కారిడార్​లో మూడు కొత్త ట్రాఫిక్ ​సెక్టార్లు ఏర్పాటు చేస్తున్నారు. సిటీ నలుమూలల నుంచి డైలీ ఐటీ, ఇతర ఉద్యోగులు ఐటీ కారిడార్​కు వస్తుంటారు. దీంతో మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్​పల్లి ట్రాఫిక్​పీఎస్​ల పరిధిలో వెహికల్స్​ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ స్టేషన్ల పరిధిలోని ఆఫీసర్లు, సిబ్బందిపై వర్క్ ​ప్రెజర్​ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కొత్త సెక్టార్లు ఏర్పాటు చేస్తే సిబ్బందిపై వర్క్​బర్డెన్ ​తగ్గి, ట్రాఫిక్ ​కంట్రోలింగ్ ఈజీ అవుతుందని ట్రాఫిక్​ డీసీపీ విజయ్​కుమార్ తెలిపారు. మాదాపూర్​, గచ్చిబౌలి, కూకట్​పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సోమవారం నుంచి కొత్త సెక్టార్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. మాదాపూర్​ట్రాఫిక్​ పీఎస్​ పరిధిలో రాయదుర్గం సెక్టార్, గచ్చిబౌలి పీఎస్ ​పరిధిలో నార్సింగి సెక్టార్, కూకట్​పల్లి ట్రాఫిక్ పీఎస్ ​పరిధిలో కేపీహెచ్ బీ సెక్టార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాయదుర్గం సెక్టార్ రాయదుర్గం లా అండ్ ఆర్డర్​ పీఎస్​ బిల్డింగ్​లోని హాల్​లో, నార్సింగి సెక్టార్ నార్సింగి లా అండ్ ఆర్డర్ పీఎస్​లోని రూమ్​లో, కేపీహెచ్ బీ సెక్టార్ కేపీహెచ్ బీ లా అండ్ ఆర్డర్ పీఎస్​ పక్కనే ఉన్న హాల్​లో ఏర్పాటు చేశామన్నారు. సీపీ స్టీఫెన్​ రవీంద్ర ఒక్కో సెక్టార్​కు ఒక ఇన్​స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, 45 మంది  కానిస్టేబుల్స్​ కేటాయించినట్లు తెలిపారు. సోమవారం నుంచి సిబ్బంది డ్యూటీ స్టార్ట్ చేస్తారు.

మరిన్ని వార్తల కోసం..

ఎల్​ఐసీలో పాన్​ అప్​డేట్​ ఇలా..

ఆధార్ కార్డ్‌‌‌‌లో  ఫొటో మార్చండి ఇలా...

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్