లింగంపేట మండలంలో మూడు పంచాయతీలు ఏకగ్రీవం

లింగంపేట మండలంలో మూడు పంచాయతీలు ఏకగ్రీవం

లింగంపేట, వెలుగు :  మండలంలోని ఎల్లారం, బానాపూర్​తండా గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఎల్లారం గ్రామ సర్పంచ్​గా గంగి లింగం, బానాపూర్ తండా సర్పంచ్​గా  పీర్​సింగ్​ ను ఎన్నుకున్నారు. రెండు పంచాయతీల్లో వార్డు సభ్యులను సైతం  ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా  ఎన్నికైన పాలకవర్గ సభ్యులు సింగిల్ నామినేషన్లు వేయాలని ఇరు గ్రామాల  ప్రజలు నిర్ణయించినట్లు తెలిపారు.

కాటేపల్లి తండా సర్పంచ్​ ఏకగ్రీవం

పిట్లం : పెద్దకొడప్​గల్ మండలం కాటేపల్లి తండా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.   గోతి రవీందర్​ను సర్పంచ్​గా ఎ న్నుకున్నారు.  తండాలో కాయితీ లంబాడాలు ఉండగా వారు బీసీ కేటగిరీ కిందకు వస్తారు. గత ఎన్నికల్లో అధికారులు తండాను పొరపాటుగా ఎస్టీలకు కేటాయించడంతో ఎస్టీలు లేక ఎవరూ నామినేషన్​ వేయలేదు. ఏడు సంవత్సరాలు ప్రత్యేక అధికారి పాలన సాగింది.  తండాలో  570 ఓటర్లు ఉన్నారు. తండా అభివృద్ధికి కృషి చేస్తానని ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్​అభ్యర్థి రవీందర్​ తెలిపారు.  తనపై నమ్మకంతో సర్పంచ్​గా ఎన్నుకున్న తండావాసులకు కృతజ్ఞతలు తెలిపారు.