కరోనా కల్లోలం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

కరోనా కల్లోలం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

కరోనా మనుషుల జీవితాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కుటుంబాలను బలితీసుకుంటుంది. జగిత్యాల  జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతిచెందారు. తండ్రితో పాటు.. ఇద్దరు కొడుకులు కరోనాతో మృతి చెందారు. తండ్రి దొంతుల రామచంద్రం (67) మరణించిన కొన్నిరోజుల వ్యవధిలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్ద కుమారుడు 36 ఏళ్ల సునీల్ మరణించగా..ఇవాళ చిన్న కొడుకు సుమన్(30) కూడా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లికి కూడా పాజిటివ్ వచ్చింది. 15 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కరోనాకు బలవ్వడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.