మంత్రాలు చేస్తున్నారని బట్టల్లేకుండా ఊరేగించిన్రు

మంత్రాలు చేస్తున్నారని బట్టల్లేకుండా ఊరేగించిన్రు

    ముగ్గురు మహిళలు, మరో వ్యక్తిని కొట్టిన గ్రామస్తులు

గర్హ్వా: మంత్రాలు చేస్తున్నారనే ఆరోపణలతో దాదాపు 50 మంది కలిసి ముగ్గురు మహిళలు, మరో వ్యక్తిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి, బట్టల్లేకుండా ఊరేగించారు. ఈ దారుణ సంఘటన జార్ఖండ్ లోని గర్హ్వా జిల్లా నారాయణ్ పూర్ గ్రామంలో జరిగింది. ‘‘గురువారం రాత్రి 10 గంటలప్పుడు ఈ సంఘటన జరిగింది. మాకు సమాచారం అందగానే టీమ్ ను అక్కడికి పంపించాం. వాళ్లు వెళ్లేసరికి స్పాట్ లో 50 మంది ఉన్నారు. ఇద్దరిని పట్టుకోగా మిగతా వాళ్లు పారిపోయారు” అని సదార్ ఇన్ స్పెక్టర్ రాజీవ్ కుమార్ చెప్పారు. ఊర్లోని బాలి రాజ్వర్ అనే వ్యక్తి కూతుళ్లు అనారోగ్యం పాలవ్వడంతో.. రాజ్వర్, ఆయన కుటుంబసభ్యులు కలిసి ముగ్గురు మహిళలు, మరో వ్యక్తిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. కొంతమంది లోకల్స్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే బెదిరించారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితులను పట్టుకుంటామని, వాళ్లపై చర్యలు తీసుకుంటామని రాజీవ్ చెప్పారు.